బాబు హయాంలో పుష్కరాలొచ్చాయంటే భారీ దోపిడీ

తుంగభద్ర పుష్కరాలను జగన్ గారు కేవలం 200 కోట్లతో నిర్వహిస్తున్నారు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: నిన్న ఏపి సిఎం జగన్‌ తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..గతంలో పుష్కరాల పేరిట టిడిపి అధినేత, మాజీ సిఎం చంద్రబాబు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని, ఇప్పుడు జగన్ అతి తక్కువ ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. ‘హిందూ సంప్రదాయాల్లో పుణ్య స్నానాలకు విశిష్ట స్థానం ఉంది. బాబు హయాంలో పుష్కరాలొచ్చాయంటే భారీ దోపిడీకి స్కెచ్ పడేది. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో 3,400 కోట్ల రూపాయలు మేశాడు. 30 మంది ప్రాణాలు తీశాడు. తుంగభద్ర పుష్కరాలను జగన్ గారు కేవలం 200 కోట్ల రూపాయలతో ఘనంగా నిర్వహిస్తున్నారు’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/