టిడిపి పుట్టింది1982లో కదా చిట్టీ?
లోకేశ్ తాను పప్పులకే పప్పని నిరూపించుకున్నాడు..విజయసాయిరెడ్డి
అమరావతి: వైఎస్ఆర్సిపి విజయసాయిరెడ్డి టిడిపి నేత నారా లోకేశ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ అజ్ఞానంతో పలు వ్యాఖ్యలు చేశారంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. టిడిపి పుట్టింది 1982లో అయితే, 1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టిడిపి అడ్డుకుందని ఆయన అంటున్నారని చురకలంటించారు.
‘లోకేశ్ తాను పప్పులకే పప్పని నిరూపించుకున్నాడు. 1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టిడిపి అడ్డుకుందట. ఉద్యమాలు చేసిందట! టిడిపి పుట్టింది1982లో కదా చిట్టీ? అవునులే, మీ నాన్న స్వతంత్ర పోరాటం చేశానని చెప్పుకున్నాడు. నీవు 78లోనే విశాఖ ఉక్కు కోసం పోరాడే ఉంటావు!’ అని విజయసాయిరెడ్డి చురకలంటించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/