వైస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

ysrcp-mlc-ananthababu-remand-extended

అమరావతి : వైస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్​ నేటితో ముగియడంతో అతడిని పోలీసులు ఎస్కార్ట్​ సాయంతో కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు.

విచారణ అనంతరం రిమాండ్​ గడువు పెంచడంతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. మే 23 నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ను రెండుసార్లు కోర్టు కొట్టివేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/