మాజీ ముఖ్యమంత్రులపై విరుచుకుపడ్డ రోజా
చంద్రబాబు నాయుడు తాను చదివిన పాఠశాలను అభివృద్ధి చేయలేకపోయారు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన అమ్మ ఒడి కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చిత్తూరు జిల్లా అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా గతంలో ముఖ్యమంత్రులు పనిచేశారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు తాను చదివిన సొంత పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేకపోయారని రోజా మండిపడ్డారు. ప్రభుత్వం పాఠశాలలను మూసేసి విద్యను కార్పొరేట్ పరం చేయాలని చూసిన ఘనత చంద్రబాబుదేనని ఆమె ధ్వజమెత్తారు. పేద విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియం చదువుకొని బాగుపడాలని ఆలోచించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ ఎంతో చేస్తున్నారని అన్నారు. అ అమ్మ ఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా సీఎం పరిపాలన సాగుతుందని రోజా కొనియాడారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/