వైస్సార్సీపీ కి భారీ షాక్ ..వరుసపెట్టి జనసేనలో చేరుతున్న కీలక నేతలు

175 కు 175 సాధిస్తామని సీఎం జగన్ చెపుతుంటే..ఆ పార్టీ కీలక నేతలు మాత్రం వరుస పెట్టి జనసేన , టీడీపీ పార్టీలలో చేరుతున్నారు. మరో రెండు రోజుల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో వైస్సార్సీపీ కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబులు జనసేనలో పార్టీలో చేరారు.

TV రామారావు 2009లో టి‌డి‌పి నుంచి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు..2019 ఎన్నికల్లో టి‌డి‌పి సీటు రాలేదని చెప్పి వైస్సార్సీపీ పార్టీలో చేరారు. వైస్సార్సీపీ లో ప్రాధాన్యత లేకపోవడంతో తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సైతం జనసేన పార్టీలో చేరబోతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి మంగళగిరిలో గెలిచారు. 2014లో టి‌డి‌పిలో చేరారు. మళ్ళీ 2019 ఎన్నికల సమయంలో వైస్సార్సీపీ లో చేరారు. ఇప్పుడు వైస్సార్సీపీకి షాక్ ఇచ్చి జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. అటు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు సైతం జనసేనలో చేరారు. 1994లో ఒంగోలు నుంచి టి‌డి‌పి ఎమ్మెల్యేగా గెలిచారు. టి‌డి‌పిలో అనేక ఏళ్ళు పనిచేసిన ఈయన..2019 తర్వాత బి‌జే‌పిలో చేరారు. బి‌జే‌పిలో కూడా అంత యాక్టివ్ గా ఉండటం లేదు..దీంతో జనసేనలో చేరారు. ఇటు చేరికలపై పవన్ కళ్యాణ్ మరింత ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. త్వరలో ఇంకొన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.