రజనీకాంత్ ఫై ఆగని వైస్సార్సీపీ నేతల విమర్శలు

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకిలో శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదిక ఫై మాట్లాడుతూ చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించారు. కాగా రజనీ ప్రశంసలపై వైస్సార్సీపీ నేతలు విమర్శస్తున్నారు.

ఇప్పటికే పలువురు రజనీ ఫై విమర్శించగా..తాజాగా ఏపీ రాజకీయాలు, పరిస్థితులు రజనీకాంత్ కు ఏమి తెలుసు అని.. సినిమా ఇండస్ట్రీలో నీచుడు ఎవరనా ఉన్నారంటే అది రజనీకాంత్ నేనని వివరించారు. తన అల్లుడు తల్లిదండ్రులు ను అవమానించాడు రజనీకాంత్ అని.. సిగరెట్లు, బీడీలు పైకి ఎగరేసి నంత ఈజీ కాదు రాజకీయాలు అంటే అంటూ చురకలు అంటించారు. సినిమా వేరే రాజకీయాలు వేరేనని.. ఎన్టీరామారావు సినిమా ఇండస్ట్రీలో కి వచ్చి ఎందరికో లైఫ్ ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ పెడుతానని చెప్పి పెట్టకుండా హిమాలయ కు వెల్లినోడివి నువ్వు కూడా ఎపి రాజకీయాలు గురించి మాట్లాడుతావా అని చురకలు అంటించారు. ఒక సినిమా ఆఫర్లు ఇస్తానని చెబితే చంద్రబాబు గురించి పొగిడిన వాడివి నువ్వు.. విజనరీ అంటె చంద్రబాబు నాయుడు అన్నావని ఆగ్రహించారు. విజనరీ అంటే సీఎం కేసీఆర్ ది… హైదరాబాద్ లో 600 కోట్లతో సెక్రటేరియట్ నిర్మించారని కొనియాడారు.

కాగా రజనీ అభిమానులు మాత్రం వైస్సార్సీపీ నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #YSRCPApologizeRajini హ్యాష్‌ట్యాగ్‌తో వైసీపీ నేతలపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మీమ్స్ పోస్టు చేస్తూ ట్విట్టర్‌ను హోరెత్తించారు. దీంతో కొన్ని క్షణాల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.