పాదయాత్రలో ఉద్రిక్తత..రైతులపై వాటర్ బాటిల్స్ విసిరిన వైస్సార్సీపీ శ్రేణులు

పోటీపోటీగా నినాదాలు చేసిన రైతులు, వైస్సార్సీపీ శ్రేణులు

ysrcp-followers-attack-amaravati-farmers-in-rajahmundry

అమరావతి: రాజమండ్రిలో పాదయాత్రగా వెళ్తున్న అమరావతి రైతులపై వైస్సార్సీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆజాద్ చౌక్ మీదుగా వెళ్తున్నప్పుడు వారిపై చెప్పులు, వాటర్ బాటిల్స్ ను విసిరారు. వైస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. సాక్షాత్తు మార్గాని భరతే అమరావతి రైతులపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతులు, వైస్సార్సీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కూడా రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. కాగా, అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.