టీడీపీలో చేరిన వైస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు : లోకేష్

TDP and YSRCP
TDP and YSRCP

అమరావతి: మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌‌క‌వర్గంలో అధికార వైస్సార్సీపీ కి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు టీడీపీలో చేరినట్టు ఆ పార్టీ నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేడు మంగ‌ళ‌గిరి నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని దుగ్గిరాల మండ‌లానికి చెందిన కొన్ని గ్రామాల వారు కొందరు వైస్సార్సీపీ పార్టీ కార్య‌క‌ర్త‌లు తన సమక్షంలో టీడీపీ పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు. వైస్సార్సీపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారంతా పార్టీని విడిచిపెట్టినట్టు లోకేష్ తెలియచేశారు. వైస్సార్సీపీ కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్టు నారా లోకేష్ చెప్పారు.

తాజా తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/