తెలంగాణలో వైఎస్ఆర్ ప్రభుత్వం తేవడమే లక్ష్యం: షర్మిల

ysr-welfare-schemes-should-be-implemented-again-in-telangana-ys-sharmila

హైదరాబాద్ః వైఎస్‌ఆర్‌టిపి చీఫ్ వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆమెకు బట్వాన్ పల్లి, మన్నేగూడేం, పెర్కపల్లి గ్రామాల్లో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం రావాలని షర్మిల డిమాండ్ చేశారు. కెసిఆర్‌ సర్కార్ ఇళ్లులు కట్టే ప్రభుత్వం కాదని, పేదలకు పెన్షన్ ఇచ్చేది కాదని ఆరోపించారు. కెసిఆర్ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కాదని విమర్శించారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు మళ్ళీ తెలంగాణలో అమలు కావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ప్రజలకోసమే బ్రతికాడని, ప్రజల కోసమే చనిపోయాడని తెలిపారు.

వైఎస్ఆర్ ప్రభుత్వం తేవడమే లక్ష్యంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్‌టిపి అని షర్మిల స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇళ్లులు మంజూరు చేయాలన్న ఆమె… ఇంట్లో ఎంత మంది వృద్దులుంటే అంతమందికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, అరోగ్య శ్రీ పథకాలకు పునర్వైభవం రావాలన్నారు. వైఎస్సార్ లా ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/