చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ విగ్రహం ధ్వసం

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం ఓఎన్‌ కొత్తూరు గ్రామం శివారులో ఉన్న YSR విగ్రాహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేయడం కలకలం సృష్టిస్తుంది. గురువారం అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వైఎస్సార్‌ విగ్రహ ధ్వంసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇది తెలుగుదేశం కార్యకర్తల పనే అని వైస్సార్ అభిమానులు, వైసీపీ కార్య కర్తలు ఆరోపిస్తున్నారు.