గుంతకల్లో ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను ప్రారంభించిన ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి

గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్‌ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. ఒక్క పూట అన్నం కోసం ఎంతోమంది అలమటిస్తున్నారని..అలాంటి వారికీ కేవలం రూ.6 లకే భోజనం అందించాలనే లక్ష్యంతో ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను ఏర్పాటు చేశామని వైవీఆర్‌ అన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భవానీ, వైస్‌ చైర్‌పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ గుంతకల్లు, పామిడి ఎంపీపీలు మాధవి, మురళీరెడ్డి, వైస్‌ ఎంపీపీ ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, ఏడీసీసీ మాజీ చైర్మన్‌ పామిడి వీరాంజనేయులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు ఎన్‌.రామలింగప్ప, రామాంజనేయులు, పార్టీ పట్టణ కన్వీనర్లు సుంకప్ప, హుసేన్‌పీరా, సీనియర్‌ నేతలు శ్రీనివాసరెడ్డి, మంజునాథరెడ్డి, సందీప్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.