ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్..25 నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ

ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్..25 నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ అందించబోతుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు విడతలుగా వైఎస్సార్ ఆసరా నిధులను అందజేసింది. ఇక తాజాగా వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 25వ తేదీన ఏలూరు జిల్లా దెందలూరు లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాలలో ఆయా ఎంపీ మరియు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ఈ వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగం గానే ఇప్పటికే రెండు విడతల్లో వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేయనున్నారు.