వివేకా హత్య కేసులో నలుగురి విచారణ
కీలక సమాచారం రాబట్టిన అధికారులు!

కడప : ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దాదాపు 91 రోజులుగా విచారణ సాగిస్తున్న సీబీఐ అధికారులు తాజాగా మరో నలుగురు అనుమానితులను విచారించారు. వీరిలో పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, తొండూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివమోహన్రెడ్డి ఉన్నారు. కడపలో వీరిని విచారించిన అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది.
అలాగే, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి తల్లి బీబీని పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విచారించారు. హత్య జరగడానికి రెండు నెలల ముందునుంచీ వివేకానందరెడ్డి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో కాల్డేటా ద్వారా వివరాలు సేకరించిన అధికారులు దాని ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/