వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విజయమ్మ
అమరావతిః సిఎం జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మికి పెను ప్రమాదం తప్పింది. ఒక ఫంక్షన్ కు హాజరు కావడానికి ఆమె కర్నూలుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా గుత్తి దగ్గర కారు టైర్లు పేలిపోయి ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె వేరే కారులో వెళ్లిపోయారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/