వైఎస్ సునీత పొలిటీకల్ ఎంట్రీ..పోస్టర్ల కలకలం
వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కడపజిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిసాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాగా, త్వరలోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలోనే.. వైఎస్ సునీత పొలిటీకల్ ఎంట్రీ.. ఇస్తున్నట్లు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
వై.యస్. సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి కి రాత్రి పట్టణంలో పోస్టర్లు అతికించారు. పోస్టర్ లలో వై.యస్.వివేకా, టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్య నేతల ఫోటోలు ఉన్నాయి. అయితే, ఈ ఫోటోలు ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు. నిజంగానే, వైఎస్ సునీత పొలిటీకల్ ఎంట్రీ ఇస్తారా.. లేక.. ఇదంతా ఫేక్ న్యూస్ అనేది తెలియాల్సి ఉంది.