దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన వైస్ షర్మిల

సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ బిఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులను YSRTP అధినేత్రి వైస్ షర్మిల మంగళవారం పరామర్శించారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సాయన్న ఆదివారం యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మరణం తో పార్టీ లోనే కాదు కంట్మోనెంట్‌ పరిధిలో విషాదం నెలకొంది. ఓ మంచి నేతను కోల్పోయామని అందరు మాట్లాడుకుంటున్నారు.

కాగా సాయన్న కుటుంబ సభ్యులను YSRTP అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. సాయన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సాయన్న లాంటి ఎమ్మెల్యే చాలా అరుదుగా ఉంటారని, ఆయన ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజలకు సేవలు అందించారని షర్మిల గుర్తు చేశారు.