సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల ఫైర్

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం మ‌రో రూ.3,548 కోట్లు పెంచారని, గతంలో పెంచిన ప్యాకేజీలతో పాటు తాజా ప్రతిపాదనలకు ఇటీవల జరిగిన కేబినెట్‌‌ భేటీలో ఆమోదముద్ర వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.

‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు రోజు రోజుకు పెంచుకుంటూ పోతుండు కేసీఆర్ సారు. 38,500 కోట్ల రూపాయ‌ల‌తో మొదలై లక్ష 20 వేల కోట్ల రూపాయ‌ల‌కు చేరుకొంది’ అంటూ ష‌ర్మిల ట్వీట్ చేశారు. ‘ఒకవైపు .. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కు పైసలు లేవు.. రైతు రుణమాఫీకి డబ్బులు లేవు.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్ముకోవాలి, కానీ, మేఘ ప్రాజెక్టులకు డబ్బులు కట్టబెట్టడానికి మాత్రం అప్పులు చేసి మరీ కేసీఆర్ దొర పైసలు కుమ్మరిస్తారు, మీది దేశంలోనే అద్భుత “మేఘ” పరిపాలన దొర గారు’ అంటూ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/