ఈరోజు ఢిల్లీలో వైఎస్ షర్మిల ధర్నా

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ఈరోజు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ధర్నా చేప్పట్టబోతోంది. ధర్నా అనంతరం “పార్లమెంట్ ముట్టడి” ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం.

ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారని షర్మిల ఆరోపించడం జరిగింది. ఇది అవసరం లేని ప్రాజెక్టన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు ఖర్చును మూడింతలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదంటారా..? విచారణ జరగవద్దంటారా..? కనీసం క్వాలీటీ అయినా ఉందా..?’ అని ప్రశ్నించారు.

గతంలో గోదావరి నదికి ఎంత పెద్ద వరద వచ్చినా స్థానిక రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల బ్యాక్ వాటర్ తో రైతుల పంటలు ముప్పునకు గురవుతున్నాయని షర్మిల అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన 80 శాతం ప్రాజెక్టులను ఒకే ఒక కాంట్రాక్టర్ కు ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటైనా సీఎం కేసీఆర్ నెరవేర్చారా..? అని మండిపడ్డారు.

అనాడు రాజశేఖర్ రెడ్డి రూ.38 వేల 500 కోట్ల వ్యయంతో అంబేడ్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూపొందించారని, దీని ద్వారా 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు అందించాలని ప్లాన్ చేశారని వైఎస్ షర్మిల చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైనింగ్ పేరుతో ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుపై ఖర్చు పెట్టి … కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాతమ్రే నీళ్లు ఇచ్చేలా నిర్మాణం చేశారని ఆరోపించారు. మరి ఈరోజు ఢిల్లీ లో షర్మిల ధర్నా ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.