నేటి నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర పున:ప్రారంభం

ys sharmila

హైదరాబాద్ : నేటి నుండి వైఎస్సార్‌టీపీ వైఎస్ షర్మిల‘‘ప్రజాప్రస్థానం’’ పాదయాత్ర మళ్లీ పున:ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుండి షర్మిల తన పాదయాత్రను మొదలు పెట్టారు. పాదయాత్రలో 21 వ రోజున ఆగిపోయిన గ్రాముమ్ నుంచే 22 వ రోజు పాదయాత్ర తిరిగి మొదలు కానుంది .ఈ రోజు 11.౩౦ గంటలకు లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌లో షర్మిల కొండపాక గూడెంకు చేరుకుంటున్నారు. కొండపాక గూడెం నుంచి నార్కట్ పల్లి వరకు 5 కిలోమీటర్ మేరకు పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణ రాజన్నా రాజము లక్ష్యంగా ప్రకటించిన షర్మిల చేవెళ్ల వేదికగా ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. గతేడాది నవంబర్‌ 21న స్థానిక ఎన్ని కలు, కరోనా వల్ల పాదయాత్రకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/