ఏటిఎంకు నిప్పంటించిన దుండగులు

ATMs center
ATMs center

హైదరాబాద్‌: నగరంలోని ఓ ఏటిఎం సెంటర్‌కు నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చాంద్రాయణ గుట్టలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏటిఎంల్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ ఏటిఎంలు దగ్ధమయ్యాయి. బంగారు మైసమ్మ దేవాలయానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంకుల ఏటిఎంల వద్దకు వచ్చిన దుండగులు ఈ చర్యకు పాల్పడిపారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏటిఎం కేంద్రాల్లో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వచ్చి మంటలు ఆర్పారని పోలీసులు తెలిపారు. బృందంగా వచ్చిన కొందరు యువకుల ముఠా ఏటీఎంలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. చోరీ యత్నంలో భాగంగా ఏటిఎంకు ఆయిల్ కూడా పూశారని తెలిసింది. అయినప్పటికీ అది తెరచుకోకపోవడంతో పెట్రోల్ పోసి తగులబెట్టి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/