కడపలో ఘోరం : దివ్యాంగురాలిపై అత్యాచారం

gang-rape-in-nizamabad

ఏపీలో వరుసగా మహిళల ఫై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఓపక్క దిశ చట్టాలు , కఠిన శిక్షలు ప్రభుత్వం తీసుకొస్తున్న కామాంధులు మాత్రం వరి ఆగడాలను ఆపడం లేదు. ఎక్కడో ఓ చోట దారుణమైన ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కడపలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన ఘటన యావత్ ప్రజానీకాన్ని తలదించుకునేలా చేసింది.

కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక (15) మానసిక దివ్యాంగురాలు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి నివాసం ఉంటుంది. దగ్గరలోని మేనత్త ఇంటికి అప్పుడప్పుడు వెళ్లేది. ఈ క్రమంలో అత్త కొడుకు శివ ఆ బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శివ తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో బాలికకు రక్తస్రావం కావడంతో తల్లి ఆసుపత్రిలో చూపించింది. దీంతో అసలు విషయం బయటపడింది. బాలిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. బాలిక మానసిక పరిస్థితి బాగోకపోవడంతో చెప్పలేకపోయింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.