జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం

టెక్నలాజి రోజు రోజుకు ఎంతగానో అభివృద్ధి అవుతున్నప్పటికీ..ఇంకా కొన్ని ప్రాంతాలను మూఢనమ్మకాలు వదలడం లేదు. ధనవంతులను కావాలని , పిల్లలను పుట్టాలని ఇలా పలు కోర్కెలు తీరాలని దొంగ స్వామిజి లను నమ్ముతూ డబ్బును పోగొట్టుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.

స్మశాన వాటికలో శవాలను కాల్చిన చోట గుర్తు తెలియని ఓ వ్యక్తి నగ్నంగా నిలబడి పూజలు చేయడం, బూడిదని శరీరానికి రాసుకోవడం వంటివి చేసి వార్తల్లో నిలిచాడు. అర్థరాత్రి పట్టణంలో ఇలా యువకుడు బట్టలు లేకుండా పలు వీధులలో నగ్నంగా తిరుగుతుండడంతో స్థానికులు భయబ్రాంతులకు గురిచేసింది. నోటితో ఏవేవో మంత్రులు చదువుతున్నాడు. అటు వైపుగా వెళ్తున్న కొందరు యువకులు దీనిని చూసి సెల్ ఫోన్ లో బంధించారు. అనంతరం అతన్ని కర్రలతో వెంబడించి తరిమికొట్టారు. ప్రస్తుతం ఆ యువకుడు నగ్నంగా తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ యువకుడికి సంబదించిన వివరాలు తెలియాల్సి ఉంది.