చాలా కాలం తర్వాత అమ్మను కలుసుకున్న యూపీ సీఎం

ఉత్తరాఖండ్ లోని పౌరీలో పర్యటించిన యోగి

లక్నో: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలకాలము తర్వాత అమ్మ దీవెనలతో, ఆనందంతో పొంగిపోయారు. ఈ అరుదైన దృశ్యం మంగళవారం ఉత్తరాఖండ్ లోని పౌరీలో చోటు చేసుకుంది. అది యోగి స్వగ్రామం. సుదీర్ఘకాలం తర్వాత ఆయన తన సొంతూరులో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అమ్మ పాదాలకు నమస్కరించి దీవెనలు అందుకున్నారు. ఈ ఫోటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. యోగి మేనల్లుడికి పుట్టు వెంట్రుకల వేడుక బుధవారం ఉండడంతో సొంతూరికి చేరుకున్నారు. ప్రధాని మోడీ మాదిరే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కుటుంబానికి దూరంగా ఉంటుంటారు.

కాగా, కరోనా సమయంలో 2020 ఏప్రిల్ లో కన్నతండ్రి అంత్యక్రియలకు యోగి వెళ్లలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ప్రజలు అందరికీ తండ్రిగా కోవిడ్ నిబంధనల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తానే, వాటిని ఉల్లంఘిస్తే ఎలా అంటూ ఆయన ఆ సందర్భంలో విమర్శకులను ప్రశ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/