ఎస్‌ బ్యాంకు సంక్షోభం..అనిల్‌ అంబానీకి సమన్లు

ఎస్‌ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ రూ.12,800 కోట్లు రుణాలు

anil ambani
anil ambani

న్యూఢిల్లీ: ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో ఆబ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మనీలాండరింగ్‌ కేసులో అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈకేసుకు సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి షాక్ తగిలింది. ఈ కేసులో విచారణ నిమిత్తం హాజరు కావాలని ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ రూ.12,800 కోట్లు రుణాలు తీసుకోవడం, అవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఆయనపై ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. నోటీసులపై అనిల్ అంబానీ స్పందిస్తూ.. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సమయం కావాలని, ఆరోగ్యం బాగోలేని చెప్పారు. కాగా, సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులకు పలు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/