దేనిని కూల్చాలన్నా రిమోట్‌ కంట్రోల్ జగన్ చేతిలోనే

న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని ఖండిస్తున్నాం

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతి: టిడిపి నేత యనమల రామకృష్ణుడు ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ..వైఎస్‌ఆర్‌సిపి నేతల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో పేదలనే కాకుండా, వ్యవస్థలను కూడా వైఎస్‌ఆర్‌సిపి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దేనిని కూల్చాలన్నా ధ్వంసం చేయాలన్న రిమోట్‌ కంట్రోల్ ముఖ్యమంత్రి జగన్ చేతిలోనే ఉందని ఆయన తెలిపారు. న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు. జడ్జిలకే భద్రత లేకపోతే ఇక సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగుల కోసమే శాండ్‌ కార్పొరేషన్ ఏర్పాటుకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని ఆయన ఆరోపించారు.వైఎస్‌ఆర్‌సిపి శాండ్‌ మాఫియాకే శాండ్‌ కార్పొరేషన్‌ పగ్గాలు కూడా అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/