కేంద్రం కీలక నిర్ణయం : యమునా ఎక్స్‌ప్రెస్ వేకి వాజ్‌పేయి పేరు

ఉత్తర ప్రదేశ్ లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్చుకుంటూ వీలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లో యమునా ఎక్స్‌ప్రెస్ వే నిలిచింది. ఈ నెల 25న గౌత‌మ్ బుద్ధ‌న‌గ‌ర్ జిల్లాలోని జెవార్ లో నోయిడా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో య‌మునా ఎక్స్ ప్రెస్ వే పేరును మారుస్తూ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. విమానాశ్రయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్ వే పేరును మారుస్తూ అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు బిజెపి సీనియర్ నేత తెలిపారు.