వైరస్తో పోరాడేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోము
కరోనా వైరస్ కలకలంపై ట్రంప్తో ఫోనులో మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
బీజింగ్: కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఉండదని, చైనా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని, ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అన్నారు. శుక్రవారం జిన్పింగ్, ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని బీజింగ్ మీడియా వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా జిన్ పింగ్ వైరస్తో పోరాడేందుకు తాము ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదని ట్రంప్కు తెలిపారు. ఈ వైరస్తో పోరాటాన్ని జిన్ పింగ్ ‘పీపుల్స్ వార్’గా అభివర్ణించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటూ వేగంగా స్పందిస్తున్నామని తెలిపారు. కాగా, చైనాలో కరోనా వల్ల ఇప్పటి వరకు 636 మంది మృతి చెందారు. ఈ సంఖ్య వేలల్లోనే ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/