కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు

ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంటోంది..

Tedros Adhanom

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. ఈనేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంటోందంటూ సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ చెప్పారు. గురు, శుక్రవారం మధ్య 24 గంటల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా లక్షా 50 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో సగానికిపైగా రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే వెలుగుచూసినట్టు అధనోమ్ తెలిపారు.

చెలరేగిపోతున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన నిబంధనలు అమలు చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. అయితే, ఇప్పటికే విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోందని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత చర్యలు తీసుకోవడం వంటి వాటిని తప్పనిసరిగా పాటిస్తే వైరస్‌ను కొంతవరకు దూరం పెట్టవచ్చని అధనోమ్ వివరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/