మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే ఫలితం

సమాజంలో మార్పు రావాలి

women complete freedomwomen complete freedom
women complete freedom

భారతీయ సాంప్రదాయంలో ప్రస్తుత తరుణంలో ఒక కుటుంబం సంతోషాలతో ఉన్నదంటే కారణంగా ఆ కుటుంబ బాధ్యతలను మహిళామణులు చూసుకోవడమనేది నగ్నసత్యం.

అలాంటి తరుణంలో పూర్తిగా నిర్ణయ బాధ్యతలు సైతం వారికే ఇస్తే సమాజాన్ని బాగు పరుస్తారు కదా! ఎందుకీ ఈ మగవారి పెత్తనం. అంటే రాజ్యాంగపరంగా వారికంటూ అవకాశాలిస్తూ వాటిని మగవారు చేతుల్లోకి తీసుకోవడమా!

ఇది సరైన పద్ధతేనా? కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై దృష్టి కేంద్రీకరించి సరైన చర్యలు తీసు కొని, వారికి ప్రత్యేక శిక్షణలిస్తూ, స్వతహాగా నిర్ణయం తీసుకు నేలా, వారి తరపు మగవారి పెత్తనం లేకుండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇలా చేయకపోతే ఆడవారికి ప్రత్యేక రిజర్వేషన్స్‌ అనే విషయంలో ఎలాంటి అర్థం, లాభం లేని పరిస్థితి.

ఎన్నికలలో గెలిచిన మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ ఉండేలా, వారిపై వారి కుటుంబ సభ్యుల నియంత్రణ లేకుండేలా కార్యాలయాలలో ఆడచాటు మగపెత్తనం ఉండకుండా చర్యలు తీసుకుంటూ మహిళలకు వచ్చిన రిజర్వే షన్స్‌ను గౌరవిస్తూ, స్వేచ్ఛను కల్పించే విధంగా ప్రభుత్వాలు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్వా తంత్య్రానికి పూర్వం ఆడవారంటే వంటింటికే పరిమితం. ఆడపిల్లలను కనడానికి, చదివించడానికి సైతం అంత శ్రద్ధ వహించేవారు కాదు.

ఎందుకంటే పెళ్లి చేస్తే అత్తారింటికి వెళుతుంది. మనకెందుకులే అని తెలువకుండానే ఆర్థిక సంబంధాల గురించి తెలియచేసే ప్రక్రియ. ఆ తర్వాత కాలక్రమేణా ఎన్నో మార్పులు. ఎంతోజ్ఞానం. ఒకనాడు డబ్బులిచ్చి వధువ్ఞను కొనుక్కొనే స్థాయి నుంచి డబ్బులు తెచ్చే వధువ్ఞ వరకు పరిణితి చెందాం.

ఆనాడు భారతీయ మొదటి మహిళా అధ్యాపకురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి ఫూలే మొదలుకొని, నేటి వాస్తవిక సమాజంలో ఎందరో మహామణుల కృషి ఫలితంగా నేడు వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకోవడమే కాకుండా మగవారికి ఎంతవరకు రిజర్వేషన్స్‌ ఉన్నాయో, అంతా మాకు కూడా కావాలని ప్రశ్నించే గొంతుకలను చూస్తున్నాం.

అలాగే ‘మాకెవరు సాటి, మాకు మేమే సాటి అనేలా మగవారు చేసే ప్రతిపనిని చేస్తూ నిరూపిస్తున్న తరుణం. ఒక్క రంగంలో కాకుండా ప్రతి రంగంలోకి ప్రవేశించి మహిళ అంటే ఏంటోనని పలువ్ఞరికి ఆదర్శంగా నిలుస్తున్న ఆదర్శ మహిళలెందరో ఉన్నారు.

అలాగే సాహిత్యరంగంలో సైతం ఎందరో మహిళలు ఎన్నో రచనలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తరుణం. అందులో భాగంగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న సమయం.

ఇదియేకాకుండా విభిన్నరంగాలలో మహిళామణులు తమకంటూ ఒకస్థానాన్ని ఏర్పరచుకొని మాక్వెరు సాటిలేరని చెప్పే సమయంలో ప్రస్తుత సమాజమున్నది.

ప్రత్యేకంగా పాలకవర్గంలో మహిళామూర్తులు ఆదర్శవంతమైన పాలన గావించి తమ ధైర్యసాహసాలను చెప్పకనే చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాలలో దానికి విరుద్ధంగా జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అబద్ధం లేదు.

స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ల కారణంగా ఎన్నికైన వార్డుమెంబర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు భర్తలకు అవకాశం రాకపోవడంతో వారి భార్యలను ఎన్నికల బరిలోకి దిగబెట్టి, గెలుపొంది, ఆయా స్థానాలను చేజిక్కిం చుకోవడం జరిగింది.

కానీ వారిని కేవలం సంతకాలకే పరిమితం చేసి, వారి స్థానాలలో భార్యచాటు భర్తలా అధికారాలను చెలాయించడం జరుగుతుందంటే కారణం ఏమిటో అర్థంకానీ పరిస్థితి.

కార్యాలయాల్లో ఎన్నిక కాబడిన మహిళా మణులున్నా కూడా ఏదైనా అవసరనిమిత్తం వెళ్లితే ముందుగా వారి భర్తను కలిసి పర్మిషన్‌ తీసుకొని, అతను సమాచారం అందిస్తేకానీ పనికానీ పరిస్థితి దాపురించిందంటే అతిశయోక్తిలేదు.

ఇదంతా దేనికి సూచియో అర్థంకానీ పరిస్థితి. ఎందరో ఆదర్శ మహిళలు పోరాడి, రాజ్యాంగపరంగా వారికంటూ స్థానాలుండాలని కొని యాడితే ఇలాంటి అవకాశాలు పొందడం జరిగింది.

కానీ చివరికి అధికార చెలాయింపు, నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి లేకపోవడమే బాధాకరం. భారతీయ సాంప్రదాయంలో ప్రస్తుత తరుణంలో ఒక కుటుంబం సంతోషాలతో ఉన్నదంటే కారణంగా ఆ కుటుంబ బాధ్యతలను మహిళామణులు చూసుకోవడమనేది నగ్నసత్యం.

అలాంటి తరుణంలో పూర్తిగా నిర్ణయ బాధ్యతలు సైతం వారికే ఇస్తే సమాజాన్ని బాగు పరుస్తారు కదా! ఎందుకీ ఈ మగవారి పెత్తనం. అంటే రాజ్యాంగపరంగా వారికంటూ అవకాశాలిస్తూ వాటిని మగవారు చేతుల్లోకి తీసుకోవడమా! ఇది సరైన పద్ధతేనా?

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై దృష్టి కేంద్రీకరించి సరైన చర్యలు తీసు కొని, వారికి ప్రత్యేక శిక్షణలిస్తూ, స్వతహాగా నిర్ణయం తీసుకు నేలా, వారి తరపు మగవారి పెత్తనం లేకుండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇలా చేయకపోతే ఆడవారికి ప్రత్యేక రిజర్వేషన్స్‌ అనే విషయంలో ఎలాంటి అర్థం, లాభం లేని పరిస్థితి.

ఎన్నికలలో గెలిచిన మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ ఉండేలా, వారిపై వారి కుటుంబ సభ్యుల నియంత్రణ లేకుండేలా కార్యాలయాలలో ఆడచాటు మగపెత్తనం ఉండకుండా చర్యలు తీసుకుంటూ మహిళలకు వచ్చిన రిజర్వే షన్స్‌ను గౌరవిస్తూ, స్వేచ్ఛను కల్పించే విధంగా ప్రభుత్వాలు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సమాజంలో మహిళలకు రాజ్యాంగపరంగా 33 శాతం రిజర్వేషన్స్‌ కలిగి ఉన్నారు. గత కొంతకాలంగా పురుషులకు సరిసమానంగా అన్ని రకాల కార్యకలాపాలలో పాల్గొంటూ ‘మాకు ఎవరు సాటి లేరు అని నిరూపిస్తూ చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్స్‌ కావాలని పోరాడుతూ వస్తున్నారు.

త్వరలో అధికారికంగా సాధించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ క్షేత్రస్థాయిలో అక్కడక్కడ ఆడచాటు మగ పెత్తనం రాజ్యాంగపరంగా మహిళ ఎన్నికైనా, వారిని అడ్డం పెట్టుకొని మగవారే అధికారం చెలాయిస్తూ, రాజకీయంగా ఎదగనివ్వడం లేదనడంలో ఎలాంటి అబద్ధం లేదు.

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ప్రస్తుతం అధికశాతం కుటుంబాలలో మహిళా నిర్ణయాలే శిరోధార్యం. అలాంటి కుటుంబాలే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నాయి అనడం సైతం జగమెరిగిన సత్యం. వారికి పూర్వ స్వేచ్ఛను ఇస్తే వారి తెలివిని రుజువు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

అంతెందుకు దేశానికి ఇందిరాగాంధీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి, ఒక మహిళాశక్తి ఏంటో నిరూపించలేదా? ప్రతిభాపాటిల్‌ దేశ ప్రథమ పౌరురాలుగా, రాష్ట్రపతిగా విధులు నిర్వహించలేదా?

సుష్మా స్వరాజ్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేయలేదా? షీలాదీక్షిత్‌, మాయావతి, జయలలిత, మమతాబెనర్జీ, వసుంధర రాజే, సుచేతా కృపాలాని, ఉమాభారతి, రబ్రీదేవి, ఆనందిబెన్‌ పటేల్‌ ఇలా వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా సేవలు చేయలేదా? చేస్తలేరా?

అలాగే విభిన్న రంగాలలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ అగ్రస్థానాలకు చేరుకున్న వారెందరో ఉన్నారు. అలాంటిది ప్రస్తుత రాజకీయాల పట్ల మహిళామణుల దృష్టి సారించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది.

ఇంకా ఎంతో మంది మహిళలు స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ పాలకరంగంలో రాణించిన మాట వాస్తవం కాదా!

గ్రామాలలోకి వచ్చే సరికి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకపోవడమనేది దేనికి నిదర్శనమో అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది.

పుట్టుకతోనే ఎవరు అన్నీ నేర్చుకోరు. క్రమంగా అర్థమవ్ఞతుంటాయి. వారికి ఆ స్వేచ్ఛనిస్తే రాణిస్తారనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

రాజ్యాంగపరంగా ఎవరి హక్కులను కాలరాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఇకనైనా సమాజంలో మార్పురావాలి.

  • డాక్టర్‌ పోలం సైదులు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/