మహిళలు సైతం క్యూ లైనులో
షాద్ నగర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలలోకన్పించిన దృశ్యాలు
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం షాప్ లు తెరుచుకోవడానికి కంటే ముందే మద్యం ప్రియులు బారులు తీరారు .
క్యూ లైన్లలో మహిళలు సైతం పెద్ద సంఖ్యలో నిలబడి ఉండటం కనిపించింది.
ముఖ్యంగా షాద్ నగర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో మహిళలు మద్యం దుకాణాల ముందు క్యూలో నిలబడి ఉండటం కనిపించింది.
కాగా నలబై రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా .
పోలీసులు వైన్ షాప్ ల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా గుర్తులువేశారు.
తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/