విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ..

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన

Nirmala Sitharaman
Nirmala Sitharaman

ముఖ్యాంశాలు:

  • విద్యారంగంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ప్రోత్సాహం
  • మరో 12 స్వయం ప్రభ ఛానళ్ల ఏర్పాటు
  • బధిక విద్యార్థులకోసం ప్రత్యేక ఛానల్‌
  • ఆన్‌లైన్‌ కోర్సులకు 100 ప్రధాన వర్సిటీలకు ఆటోమేటిక్‌ విధానం
  • విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య పరస్పన సంభాషణ ఏర్పాట్లు

New Delhi:

కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్ వల్ల  విద్యార్థులకు చదువు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా నిర్మలా సీతారామన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు.

విద్యా రంగంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహం అందిస్తామన్న ఆమె,  విద్యా రంగం కోసం మరో 12 స్వయం ప్రభ ఛానళ్లను ఏర్పాటు చేస్తాన్నారు.

బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న మూడు విద్యా రంగ ఛానెళ్లకు అదనంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల కోసం కరిక్యులమ్, ఆన్‌లైన్ కరిక్యులమ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే, ఇతర విద్యార్థులకు ఆన్‌లైన్‌ కోర్సుల కోసం 100 ప్రధాన యూనివర్సిటీలకు ఆటోమేటిక్ విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు.

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య పరస్పర సంభాషణకు ఏర్పాట్లు చేస్తామనీ దీనికోసం అవసరమైన  సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

కమ్యూనిటీ రేడియోలతో పాటు బ్రాడ్‌కాస్ట్‌ విధానంలో పిల్లలకు విద్యా బోధన చేస్తామన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/