2 ప్లస్ 2 గన్మెన్ల ఉపసంహరణ
షర్మిలకు తెలంగాణ సర్కార్ షాక్
Hyderabad: వైఎస్ షర్మిలకు 15 రోజుల క్రితం ప్రభుత్వం కేటాయించిన 2 ప్లస్ 2 గన్మెన్లను ఇపుడు ఉపసంహరించింది. దీంతో ఆమె అభిమానులు కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల షర్మిల తన ప్రసంగాల్లో నిరుద్యోగుల తరుపున పోరాడుతానని, వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. దీంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోఆమె కు గన్మెన్లను ప్రభుత్వం ఉపసంహరిం చటం చర్చనీయాంశ మైంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/