సాయంత్రం 4 గంట‌ల నుంచి మ‌ద్యం దుకాణాల బంద్‌!

తెలంగాణ‌ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వుల జారీ


హైదరాబాద్: తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేటితో తెర‌ప‌డనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మ‌ద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ‌ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు. వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు క్లబ్బులు మ‌ళ్లీ ఎల్లుండి సాయంత్రం 4 గంట‌ల త‌ర్వాతే తెరుచుకుంటాయి. ఈ నెల 14న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్గొండ- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌లకు ఈ రోజు సాయంత్రం 4 గంటల వ‌రకే ప్ర‌చారం చేసుకునేందుకు వీలుంది.

ఈ రెండు స్థానాల‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈ నెల 17న కూడా మ‌ద్యం దుకాణాల‌ను మూసి వేయాల్సిందే. ఈ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల‌ను రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా గ‌ట్టిపోటీనిచ్చే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/