రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం

లాంఛనంగా జాబ్ మేళా ప్రారంభం

అమరావతి: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ప్రారంభమైంది. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మేళాను లాంఛనంగా ప్రారంభించారు. నేడు, రేపు రెండు రోజుల పాటు జాబ్ మేళా కొనసాగుతుందని చెప్పారు.

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. మూడు ప్రాంతాల్లో దశలవారీగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/