వన్యప్రాణులు ప్రకృతి నేస్తాలు

Wild Life

వన్యప్రాణులు ప్రకృతిలో భాగ మై జీవావరణ, జీవ వైవిధ్య సంరక్షణలో కీలకపాత్ర వహిస్తాయి. భూగోళంపై వన్యప్రాణులు మానవ్ఞ నికి ఆర్థికంగా,వాణిజ్యపరంగా,విజ్ఞానపరంగా, వ్యవసాయపరంగా, సాంస్కృతికపరంగా దోహదపడుతూ ప్రకృతికి సౌందర్యాన్నిస్తాయి.భూమి, ఆకాశం, నీటిలో ఉన్న ఎన్నో రకాల వన్యప్రాణులు మన చుట్టూ జీవిస్తున్నాయి.

అనేక కారణాల రీత్యా వైవిధ్యమైన వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతూ వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బ తినడం జరుగుతుంది. మాంసం కోసం వేట, పర్యావరణ మార్పు లు,అడవ్ఞలు అంతరించిపోవడం, కాలుష్యం, మానవజాతి ఆహా రం, ఆక్రమణకు గురికావడం, సెల్‌ఫోన్‌ టవర్స్‌ రేడియేషన్‌ వలన అంతరించిపోవడం జరుగుతున్నాయి. అదేవిధంగా అభివృద్ధి పేరు తో జరుగుతున్న పట్టణీకరణ,పారిశ్రామీకరణ వలన అడవ్ఞలుఅంత రించిపోవడంతో వన్యప్రాణుల ఆవాసాలకు, వాటి ఆహారానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. తద్వారా వినూత్నమైన జీవజాతి రకాల మనుగడకు పెను ప్రమాదం పొంచి ఉన్నది. ప్రపంచ భూభాగం పరిమాణంలో 2.4శాతం ఆక్రమించిన భారతదేశం జీవవైవిధ్యంలో 8శాతం ఆవాసంగా ఉంది.

జీవవైవిధ్యంలో భాగమైన జీవజాతుల కు భారతదేశంతోపాటు ప్రపంచదేశాలలో గత కొంతకాలంగా రక్షణ కరవై అంతరించిపోవడం జరుగుతున్నాయని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.ముఖ్యంగా భారత్‌లో గత రెండున్నర దశాబ్దాలు గా చాలా పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని 15వేల మందికిపైగా ఔత్సాహికులు అందించిన వివరాల ఆధారంగా ‘ద స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ పేరుతో వెలువడిన అధ్యయనం పేర్కొన్నది.

867 రకాల పక్షుల స్థితిగతుల గురించి వారు వివ రాలు అందించారు. వన్యప్రాణులు ప్రకృతి నేస్తాలని, వాటిని వేటా డితే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, పాడే పక్షులు, కాకు లు, పిచ్చుకలు, తీరాలకు వలసొచ్చే పక్షుల సంఖ్య అత్యధికంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. వన్యప్రాణులకు రక్షణ కరవై వేటగాళ్ల ఉచ్చుకు బలవ్ఞతున్నాయి. అడవ్ఞలను నరికేయడంతో వన్యప్రా ణులు మృత్యువాతకు గురవ్ఞతున్నాయి. విద్యుత్‌ షాక్‌లు, వలల ఉచ్చుల్లో పడి మృతి చెందుతున్నాయి. మానవ్ఞడి అవసరాలకు అనుగుణంగా అడవ్ఞలు ఆక్రమణలకు గురవ్ఞతున్నాయి. అరణ్యాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి.

నిత్యం ఏదో చోట ఉచ్చుల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నాయి. వేటగాళ్ల ఆగడాలు కొనసాగుతుండడంతో అడవ్ఞల్లో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. దీంతో జంతు, పక్షి ప్రేమి కులు ఆందోళన చెందుతున్నారు.మనిషి వల్ల ప్రకృతికి జరుగుతున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. కొన్ని వన్యప్రాణి జాతులు అంత రించిపోతున్నాయి.వన్యమృగాలు, మత్స్యసంపద, వృక్షాల రకాలు, దాదాపు మొత్తం మరో ఏడువేల రకాలు అంతరించిపోయే జాబితా లో ఇప్పుడు చేరాయని ప్రకృతి సంరక్షణ అంతర్జాతీయ సమాజం (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌- ఐయుసిఎన్‌)హెచ్చరించింది.

ఈ సమాజం ప్రపంచం మొత్తం మీద 1,05,000 తెగలను సమీక్షించింది. వీటిలో 28వేల తెగలు చాలా ప్రమాదంలో ఉన్నాయని వివరించింది. ప్రతి తెగ ఏదో ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మితిమీరిన వేట, అడవ్ఞల నరికి వేత వంటి మనుషుల విధ్వంసక చర్యలే వన్యప్రాణి సంతతి విపరీతంగా నశించిపోవడానికి దారితీస్తున్నాయి.

మానవ చరిత్రలో ఊహించని విధంగా ప్రకృతి విధ్వంసం అవ్ఞతోంది. ఈ వాస్తవాన్ని తెలుసుకుని ప్రకృతిని సంరక్షించడానికి ముందడుగు వేయడమే తక్షణ కర్తవ్యమని ఐయుసిఎన్‌ హెచ్చరించింది. సముద్ర ప్రాణుల్లో ఐడ్జి చేపలు, గిటారి చేపలు, రైనోరేలు, తదితర చేపలు ఇప్పుడు అంతరించే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

వన్యప్రాణుల సంరక్షణపై ప్రపంచస్థాయిలో జరుగుతున్న చర్యలు పరిశీలించినట్లయితే ప్రపంచదేశాల చట్టపరమైన చర్యలు చేపట్ట డానికి ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యక్రమం ఆధ్వర్యంలో వన్యప్రాణుల వలస జాతుల రక్షణకై అంతర్జాతీయ వలస జాతుల భాగస్వామ్య పక్షాల సదస్సు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తూ వాటి సంరక్షణ చర్యలపై చర్చించడం జరుగు తోంది. వన్యప్రాణుల సంరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో ఐక్య రాజ్యసమితికి అనుబంధంగా ఐయుసిఎన్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలో అంతరించే దశలో, ప్రమాదంలో ఉన్న జీవజాతులను గుర్తించి రెడ్‌డేటా బుక్‌లో పొందుపరచడం జరిగింది. ఆ జాతుల ను సంరక్షించడానికి తగిన విధంగా చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలను ఆదేశించడం జరుగుతుంది.

దానికనుగుణంగా ప్రతిదేశం కూడా వన్యప్రాణుల సంరక్షణకు అభయారణ్యాలు,జాతీయ పార్కు లు, ప్రత్యేక రక్షిత కేంద్రాలు లాంటి అనేక రక్షిత కార్యక్రమాలను చేపడుతున్నాయి.అదేవిధంగా వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యు డబ్ల్యుఎఫ్‌) అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కూడా అంతరించి పోతున్న వన్యప్రాణులను గుర్తించి వాటి సంరక్షణకై ప్రపంచవ్యా ప్తంగా చర్యలు చేపట్టాలి. భవిష్యత్‌లో అంతరించిపోతున్న వన్య ప్రాణి జాతులను గుర్తించి ప్రపంచదేశాల భాగస్వామ్యంతో పటిష్ట మైన చట్టాలు తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి ఇంకా కృషి చేయాలి.

భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ చర్యలు పరిశీలించిన ప్పుడు చారిత్రకంగా వన్యప్రాణులకు మానవ్ఞనికి మధ్య అవినా భావ సంబంధం ఉంది. భారతదేశంలో రెడ్‌ డేటా లిస్టు ప్రకారం పులులు, ఏనుగులు, రాబందులు, స్నోలియోపార్డ్‌, హోలీవ్‌రిడ్డీ, అనే సముద్రపు తాబేళ్లు, గంగేస్‌రివర్‌ డాల్ఫిన్‌ అనే మంచినీటి డాల్ఫిన్‌, ఆసియాటిక్‌ లయన్‌, రెడ్‌పాండ, లయన్‌ తెలుడుమకాకు లాంటి కొన్ని జాతులు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నది.

దాని కి అనుగుణంగా భారత్‌ అనేక ప్రత్యేక సంరక్షణ చర్యలతోపాటు చట్టపరమైన చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 జీవవైవిధ్య సంరక్షణ చట్టం 2002, అడవ్ఞల సంరక్షణ చట్టం 1980ను పటిష్టంగా అమలు పరచాలి. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల లోని ఆర్టికల్‌ 48ఎలో ప్రాథమిక విధులులోని ఆర్టికల్‌ 51ఎలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రభుత్వానికి, పౌరులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుత సమకాలీన పరిస్థితులకనుగు ణంగా నవ నూతన విధానాలతో భూమి, ఆకాశం, నీటిలో నివసిస్తున్న వన్యప్రాణుల మనుగడకై కృషి చేయాలి.

  • సంపతి రమేష్‌=

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/