గతంలో సచివాలయానికి రోడ్లు ఎందుకు వేయలేదు
రాజధాని పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు, లోకేష్ డ్రామాలు ఆడుతున్నారు
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయానికి రోడ్లు వేయలేని అసమర్థ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని పేరిట అసమర్థ చంద్రబాబు, ఆయన కుమారుడు శుద్దపప్పు నారా లోకేష్ ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి బాలినేని అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/