రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం: డబ్ల్యూహెచ్‌ఓ!

నిదానంగా విజృంభిస్తోందన్న టీడ్రాస్ అడ్హనామ్..నియంత్రణ చర్యల కారణంగానే వ్యాప్తి నిదానం

Tedros Adhanom
Tedros Adhanom

అమెరికా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే లాక్ డౌన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి నిదానంగా బయట పడుతున్నామన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చాలా దేశాలు అంటున్న వేళ, డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకూ చూసిన కరోనా ప్రభావం స్వల్పమేనని, ముందుముందు మహమ్మారి విశ్వరూపం కనిపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అడ్హనామ్ వ్యాఖ్యానించారు. ఎన్నో దేశాల్లో కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ప్రారంభించిందని, కొన్ని దేశాల్లో నియంత్రణా చర్యల మూలంగా కొంత మేరకు నిదానించిందని గుర్తు చేసిన ఆయన, లాక్ డౌన్ ను శాశ్వతంగా అమలుచేసే వీలు లేదని అన్నారు.

సమీప భవిష్యత్తులో ఆరోగ్య విధానం తక్కువగా అభివృద్ధి చెందిన ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణమృదంగం సృష్టించనుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా వేసింది. కాగా ఇప్పటికే 25 లక్షల మందిని బాధిస్తూ, 1.66 లక్షలకు పైగా ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయాయి. వ్యవస్థలు స్తంభించాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/