కరోనా వ్యాప్తి పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన

ఒకే ఒక్క రోజులో 1,500 మందికి కోవిడ్19

World Health Organisation-covid-19
World Health Organisation-covid-19

చైనా మినహా మిగతా దేశాల్లో కేవలం ఒక్క రోజులో 1,500 మందికి కరోనా వైరస్‌(కొవిడ్‌-19) సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంచలన ప్రకటన వెలువరించింది. ఇదే సమయంలో చైనాను వదిలేస్తే, మిగతా దేశాల్లో మరణించిన వారి సంఖ్య 24 నుంచి 128కి పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇప్పటివరకూ మొత్తం 64 దేశాలకు వైరస్ విస్తరించిందని, ఈ దేశాల్లో 8,774 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని తన నివేదికలో తెలిపింది. రోజురోజుకూ వైరస్ విస్తరిస్తోందని, ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితని అభిప్రాయపడింది. ఈ దేశాల్లోని 60 ఏళ్ల పైబడిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ముఖ్యంగా గుండె జబ్బులతో పాటు షుగర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ సులువుగా సోకుతుందని, వారు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధ్నామ్ గీభ్రీయేసూస్ హెచ్చరించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/