ఏడెనిమిది వ్యాక్సిన్ల పనితీరు బాగుంది

వాటినే అభివృద్ధి చేస్తామంటున్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్

Tedros Adhanom

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి నియంత్రణ వాక్సిన్స్‌ కోసం పలు దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ కోసం అనేక దేశాల్లో ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు సాగిస్తున్న పరిశోధనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సమన్వయం చేస్తోంది. ఈ అంశంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రీసియస్ స్పందించారు. ప్రస్తుతం ఓ ఏడెనిమిది వ్యాక్సిన్ల పనితీరు ఆశాజనకంగా ఉందని తెలిపారు. 400 మంది శాస్త్రవేత్తలు ఈ పరిశోధనల్లో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే 40 దేశాల నుంచి 8 బిలియన్ డాలర్ల మేర నిధులు వచ్చాయని, వ్యాక్సిన్ ను సత్వరమే తీసుకురావాలంటే ఈ నిధులు సరిపోవని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ను పరిపూర్ణ దశకు తీసుకురావడమే కాదు, దాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా చూడడం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/