రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ?
న్యూఢిల్లీ,: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే దుశంలోని 20 శాతం అత్యంత నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. న్యా§్ు గా వ్యవహరించే ఈ పథకానికి సండంధించి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో భార్యకు భరణం చెల్లించాలని కోర్టు తెలపగా, న్యా§్ు సొమ్ము రాగానే ఇస్తానని సదరు భర్త న్యాయస్థానానికి జవాడు ఇచ్చాడు, ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. భోపాల్ కు చెందిన ఆనంద్ అనే వ్యక్తికి 2006 లో దీప్ మాలా అనే మహిళతో వివహం అయింది. అయితే పెళ్లయిన కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య అబిప్రాయబేదాలు కవచ్చాయి. దీంతో ఇద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కేసును కవిచారించిన కోర్టు భార్యకు నెలకు రూ.3 వేలు , కుమార్తె ఖర్చులకు నెలకు రూ.1500 బొప్పున చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఆనంద్ స్పందిస్తూ. ప్రస్తుతం తన దగ్గర అంత సొమ్ము లేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత పథకం కింద నెలకురూ. 6.000 ఇస్తామని చెప్పారనీ, దాని నుంచి ఈ భరణాన్ని చెల్లిస్తానని చెప్పాడు. తన బ్యాంకు ఖాతా నుంచి ఈ సొమ్ము నేరుగా భార్యాపిల్లల ఖాతాల్లోకి పడేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 29కి వాయిదా వేసింది. న్యా§్ు పథకం ద్వారా 25 కోట్ల మంది ప్రజలు లేదా ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు లబ్దిట చేకురనుంది.
మరిన్నీ తాజా జాతియ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/