ఓవైపు కరోనా …మరోవైపు ఫ్లూ బాధితులు!

పశ్చిమ బెంగాల్‌లో 92 వేలమందిలో ఫ్లూ తరహా లక్షణాలు

mamata benergee
mamata benergee

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కరోనాతో పాటు భారీ సంఖ్యలో ఫ్లూ బాధితులు ఉన్నట్లు వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ లో 92 వేల మందిలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలు కనిపించడం అక్కడి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్ 7 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఆరోగ్య కార్యకర్తలు విస్తృత సమాచారం సేకరించారు. సుమారు 5.57 కోట్ల గృహాలకు వెళ్లి వివరాలు రాబట్టారు. ఈ సమాచారాన్ని విశ్లేషించగా, 92,000 మందిలో ఫ్లూ తరహా లక్షణాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇంతటి విస్తారమైన స్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించడం వల్ల ఈ వివరాలు తెలిశాయని, వైరస్ మహమ్మారిని తరిమేసేంత వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఫ్లూ బాధితుల్లో 375 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరగా, వారిలో 62 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని, వారికి చికిత్స అందిస్తున్నామని మమతా బెనర్జీ వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/