మేము కేంద్రం ఆదేశాలను పాటిస్తాం

ఆర్మీ, వాయు, నౌకాదళ సేనలు ఒక జట్టుగా పనిచేస్తాయి

Bipin Rawat
Bipin Rawat

న్యూఢిల్లీ: దేశ తొలి త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవణే, వాయు సేన అధిపతి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, నౌకాదళ అధిపతి కరంబీర్ సింగ్ తో పాటు పలువురు సీనియర్ అధికారులతో కలిసి ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ మాట్లాడుతూ… ఆర్మీ, వాయు, నౌకాదళ సేనలు ఒక జట్టుగా పనిచేస్తాయని అన్నారు. అన్ని విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని చెప్పారు. ఆర్మీ, వాయుసేన, నౌకాదళంలో రాజకీయాల జోక్యంపై ఆయన స్పందిస్తూ… రాజకీయాల నుంచి తాము చాలా దూరంగా ఉంటామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు చేసే సూచనల మేరకు పనిచేస్తామని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/