టిడిపిపై ఆరోపణలు చేయాల్సిన అవసరం మాకు లేదు
మాజీ పీఎస్ ఇచ్చిన సమాచారం మేరకే దాడులు జరిపారు
అమరావతి: టిడిపిపై ఆరోపణలు చేయాల్సిన అవసరం తమకు లేదని వైఎస్సార్సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఏకకాలంలో కడపలో టిడిపి చెందిన శ్రీనివాసులు రెడ్డి ఇంటిలో, ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యుల ఇళ్లలో, నారా లోకేష్ సన్నిహితుల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారని తెలిపారు. ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పీఎస్ నివాసంలో దాడులు జరిపామని, నేరారోపణ చేయడానికి ఆధారాలతో కూడిన అనేక అంశాలను సీజ్ చేశామని, సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అక్రమంగా లావాదేవీలు జరిగాయన్న విషయాన్ని ఐటీ శాఖ ప్రకటనలో ఉందని, ఆ విషయాన్నే తాము చెబుతున్నామని అంబటి అన్నారు. మేము ఏం చేయలేదంటే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. ఇంకా ముందుంది ముసళ్ల పండగ అని అంబటి రాంబాబు టిడిపిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/