రాజీనామా ఊహాగానాల‌ను ఖండించిన‌ యడియూర‌ప్ప

త‌న ప‌ట్ల జేపీ న‌డ్డాకు మంచి అభిప్రాయం ఉంద‌న్న సీఎం

న్యూఢిల్లీ : క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పుపై ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి యెడియూర‌ప్ప‌ స్పందించారు. ఢిల్లీకి వెళ్లి త‌మ పార్టీ అధిష్ఠానంతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్రధాని నరేంద్ర మోడితో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంతరం తాను జేపీ న‌డ్డాతో క‌ర్ణాట‌క‌లో బీజేపీ అభివృద్ధిపై చ‌ర్చించాన‌ని యడియూర‌ప్ప చెప్పుకొచ్చారు. త‌న ప‌ట్ల ఆయ‌న‌కు మంచి అభిప్రాయం ఉంద‌ని, క‌ర్ణాట‌క‌లో బీజేపీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై చ‌ర్చించేందుకు ఢిల్లీకి వ‌చ్చాన‌ని, వ‌చ్చేనెల మ‌రోసారి ఢిల్లీకి వ‌స్తాన‌ని అన్నారు. మేకెదాటు ప్రాజెక్టుపై ప‌లువురు కేంద్ర‌ మంత్రుల‌ను క‌లిశాన‌ని, ఆ ప్రాజెక్టును సాధించి తీరుతామ‌ని తేల్చిచెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/