బొగ్గు గనుల వేలం నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి
కేంద్రాని డిమాండ్ చేసిన కవిత
హైదరాబాద్: బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. కార్మికుల సమ్మెతో గనులు అన్ని మూతపడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు వేలం వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వేలాదిమంది బొగ్గు గని కార్మికులు సమ్మెలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ సైతం సమ్మెలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తాజా కరోనా లాక్డౌన్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/