విశాఖ తీరంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బంకర్లు

జపాన్ దాడుల నుంచి రక్షణ కోసం నిర్మితమైన బంకర్లు

Second World War Bunker Identified In Vizag Beach

విశాఖపట్న: విశాఖ సాగరతీరంలో రెండో ప్రపంచయుద్ధం నాటి కాంక్రీటు బంకర్లు బయటపడ్డాయి. విశాఖ, యారాడ, జాలరిపేట తదితర ప్రాంతాల్లో తీర ప్రాంతంలోని ఇసుక కోతకు గురి కావడంతో ఈ బంకర్లు బయటపడ్డాయి. తొలుత వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీటిని చూసేందుకు నగరవాసులు ఆసక్తిని చూపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ వారి తరపున భారత నావికులు జపాన్ తో పోరాడారు. ఆ సమయంలో శత్రుదేశం వాయు, నౌక దాడుల నుంచి ఈ బంకర్ల ద్వారా సైనికులు రక్షణ పొందారు. ఈ బంకర్లను కాంక్రీట్ తో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో విశాఖపై దాడి చేసేందుకు జపాన్ సిద్ధపడినట్టు కూడా చరిత్రకారులు చెపుతున్నారు. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది కావడంతో తూర్పు నావికాదళాన్ని ఏర్పాటు చేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/