2 మిలియన్ క్లబ్ లో వీరయ్య

మెగాస్టార్ నుండి అసలు సిసలైన మాస్ ఫిలిం వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి వాల్తేర్ వీరయ్య తో రుజువైంది. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి – శృతి హాసన్ జంటగా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ..సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన నాటి నుండి ఈరోజు వరకు కూడా హౌస్ ఫుల్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మధ్య కాలంలో హౌస్ ఫుల్ బోర్డ్స్ ఎక్కువగా కనిపించిన సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాలే అనిచెప్పవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి ఎలా అయితే అభిమానులు చూడాలనుకున్నారో ఆలా చూపించేసరికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా బాక్సాఫీసును కొల్లగొడ్తోంది. తాజాగా 2 మిలియన్ డాలర్ ప్లస్ క్లబ్ లోకి చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వారంలో 3 మిలియన్ డాలర్ల ప్లస్ లోకి చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వస్తున్నారు. ఈ సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లను కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 83.53 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ భారత్ రూ.5.65 కోట్లు ఓవర్సీస్ లో రూ.10.20 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ.53.53 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సక్సెస్ ను మెగాస్టార్ తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.