ఆగష్టు వరకు ఆగాల్సిందే

టీ20 వాయిదాపై నిర్ణయం అపుడే: ఐసిసి

t20 world cup 2020
t20 world cup 2020

దుబాయ్ : కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాలోకం స్తంభించిపోయింది. ఇప్పటికే చాలా రకాల టోర్నిలు రద్దు అవడం లేదా వాయిదా పడడం జరిగింది. ఇపుడు ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్ట్‌కప్‌ పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. కాని ఇప్పటి వరకు దీనిని వాయిదా వేయాలా వద్దా అన్న ఓ నిర్ణయానికి మాత్రం ఐసిసి రాలేకపోతుంది. ఇపడు వాయిదా వేస్తే.. వచ్చే రెండు లేదా మూడు నెలలో పరిస్థితి మెరుగయితే ఏం చేయలేం. కాబట్టి ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే అని ఐసిసి అధికారి ఒకరు తెలిపారు. ఆగస్టు వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోం.. కాబట్టి అప్పటి వరకు టి20 వరల్డ్‌కప్‌ నిర్వహణపై ఎలాంటి అప్‌డేట ఆశించవద్దు అని అధికారి సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/