వివేకానంద రెడ్డి హత్య కేసులో ఛార్జ్షీట్ దాఖలు..ఆ నలుగురే వివేకా మృతికి కారణం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. వైఎస్ వివేకా మృతికి నలుగురు కారణమని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో గంగిరెడ్డి, సునీల్ యాదశ్, ఉమా శంకర్రెడ్డి, దస్తగిరిపై అభియోగాలు మోపింది. వివేకానందరెడ్డి మృతికి ఆ నలుగురు కారణమని పేర్కొంది.. ఇక, ఈ కేసులో నిందితులైనవారిని ఆగస్టు, సెప్టెంబర్లో అరెస్టు చేశామని.. అరెస్ట్ చేసిన నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించామని తెలిపింది. మరోవైపు, ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కూడా పేర్కొంది సీబీఐ.
దాదాపుగా నాలుగు నెలల నుంచి సాగుతున్న విచారణలో సేకరించిన ఆధారాలను నాలుగైదు బండిల్స్ను చార్జిషీట్ గా సమర్పించింది సీబీఐ. మంగళవారమే చార్జిషీట్ దాఖలు చేసేందుకు పులివెందుల కోర్టుకు వచ్చారు సీబీఐ అధికారులు.. కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవులో ఉండటంతో.. తిరిగి వెళ్లిపోయిన అధికారులు.. ఇవాళ వచ్చి దాఖలు చేశారు.