కేసీఆర్ వ్యాఖ్యలపై వివేక్ వెంకట స్వామి కౌంటర్

జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశమంతా చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు వివేక్ వెంకట స్వామి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, లిక్కర్ స్కాంలో కేసీఆర్ ఫ్యామిలీ పూర్తిగా కూరుకుపోయిందని, కేసీఆర్ కు దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీకి అంగీకరించాలని సవాల్ విసిరారు. అవినీతిని వెలికి తీస్తారన్న భయంతోనే సీబీఐ విచారణ అడ్డుకునేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.

దేశ ప్రజలు మోడీ ఆవాస్ యోజన కోసం ఎదురు చూస్తున్నారని .. యూపీలో 50లక్షల గృహాలు నిర్మించారని , బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివేక్ అన్నారు. మంగళవారం నెల్లికుదురు మండలం రాజ్య తండాలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన 20 కుటుంబాలు బీజేపీలో చేరాయి. వారికీ బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు ఆయనకు తండావాసులు లంబాడి సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు.